విశాఖలో అత్తను చంపిన అల్లుడు

విశాఖపట్టణం ఆరిలోవ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది...

Update: 2023-03-11 09:56 GMT

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖపట్టణం ఆరిలోవ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అత్తను అల్లుడు చంపారు. హతురాలు నారాయణమ్మ (67)గా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఆమెను అల్లుడు బాణాల రాము హత్యకు పాల్పడ్డారు. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని అత్తపై దాడి చేశాడు. గోడకేసి తల కొట్టడంతో ఆమె మృతి చెందారు. హనుమంతవాక కొండపై ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News