AP Politics:జగన్ రెడ్డి పాలన అంతా అరాచకమే:టీడీపీ ఇంచార్జ్

జగన్ రెడ్డి పాలన అంతా అరాచకమే అని టీడీపీ పార్టీ దక్షిణ నియోజకవర్గం ఇంచార్జ్ సీతంరాజు సుధాకర్ అన్నారు. వైసీపీ అరాచక పాలన పై ఆయన శనివారం ఉదయం టీడీపీ కార్యాలయంలో చార్ట్ షీట్ విడుదల చేశారు.

Update: 2024-04-27 14:17 GMT

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: జగన్ రెడ్డి పాలన అంతా అరాచకమే అని టీడీపీ పార్టీ దక్షిణ నియోజకవర్గం ఇంచార్జ్ సీతంరాజు సుధాకర్ అన్నారు. వైసీపీ అరాచక పాలన పై ఆయన శనివారం ఉదయం టీడీపీ కార్యాలయంలో చార్ట్ షీట్ విడుదల చేశారు. ఇసుకను మాఫియా చేతిలో పెట్టి భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారని, ఫలితంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. మత్స్యకారులకు ఎటువంటి న్యాయం చేయలేదని, వేటకు వెళ్లే మత్స్యకారులకు డీజిల్ రాయితీ పెంచలేదని అన్నారు. అమ్మ ఒడికి 15 వేలు ఇస్తే, నాన్న బుడ్డికి కోట్లు కొట్టేశారు అని ఎద్దేవా చేశారు. ఒక గౌరవ ఎంపీ రఘు రామకృష్ణ రాజును హింసలు పెట్టినందుకు ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్నామని తెలిపారు.

ఋషికొండను బోడిగుండు చేశారని, ప్రకృతికి పూర్తిగా విఘాతం కలిగించారని అవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానులు అని చెప్పి నట్టేట ముంచేశారు. బాబాయి చంపిన నిందితులను కాపాడుతున్నారని విమర్శించారు. గులకరాయి నాటకాలు ప్రజలకు తెలిసిపోయాయి అంటూ మేము కూడా బ్యాండేజ్ పెట్టుకుంటే జనాలు ఇంటిలో కూర్చోపెడతారు అని పేర్కొన్నారు. సమావేశంలో కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు వురుకూటి నారాయణ జిల్లా పార్టీ నాయకులు వానపల్లి ఫణి గాయత్రి కుమారి పొడుగు కుమార్ అంకిరెడ్డి జగదీష్ విల్లూరి చక్రవర్తి గణ గళ్ళ సత్య యర్నాగుల జగదీష్ బుచ్చా రామి రెడ్డి మహేష్ దక్షిణ నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు. వీరంతా బ్యాండేజీలతో సమావేశంలో పాల్గొన్నారు.

Read More..

చంద్రబాబుపై హత్యాయత్నం నిందలు.. బయటపడ్డ అసలు విషయాలు 

Tags:    

Similar News