తుగ్లక్‌ రెడ్డి పాలనలో మహిళల ఆత్మగౌరవానికి భంగం

Update: 2022-01-25 13:26 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మంగళవారం పిలుపునిచ్చారు. ఈ నెల 28వ తేదీన టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారీ సంకల్ప దీక్ష చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. జగన్‌ రెడ్డి అరాచకపాలనకు నిరసనగా దీక్ష చేస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు.

తుగ్లక్‌ రెడ్డి పాలనలో మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగిందని ఆరోపించారు. మహిళకు ఆర్థిక దన్నుగా ఉండే డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని క్యాసినో, పబ్‌, జూదాల వేదికగా మార్చేశారని మండిపడ్డారు. నిత్యావసరాల ధరల పెంపుతో సామాన్యులపై మరింత భారం పడిందని వంగలపూడి అనిత అన్నారు.

Tags:    

Similar News