ఇంజినీర్ నా లాంటోడు అయితే ఇప్పటికే పోలవరం పూర్తయ్యేది.. ఎంపీ అభ్యర్థి కీలక వ్యాఖ్యలు

22 మంది వైసీపీ ఎంపీ లు ఉన్నా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడలేదని విజయవాడ వెస్ట్ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు.

Update: 2024-05-09 12:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: 22 మంది వైసీపీ ఎంపీ లు ఉన్నా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడలేదని విజయవాడ వెస్ట్ అభ్యర్థి సుజనా చౌదరి ఆరోపించారు. బీజేపీ ఎంతో చేసినా ఏ రోజూ చెప్పుకోలేదని వెల్లడించారు. పోలవరం 2019 నాటికి 79 శాతం పూర్తయ్యిందని తెలిపారు. నా లాంటి ఇంజనీర్ కు అప్పగిస్తే రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సీఎం అయినా అది ముళ్ల కిరీటమేనని ఎద్దేవా చేశారు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలా అన్నీ ఓవర్ నైట్ చేసేయలేం అంటూ సుజన చౌదరి వెల్లడించారు. 

Similar News