Y. S. Sharmila : షర్మిలపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-12 05:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జగన్ తో షర్మిల రాజకీయంగా విభేదించిన మాట వాస్తవమే అన్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తాము ఏమీ అనలేదన్నారు. ఏపీకి వచ్చి కాంగ్రెస్ లో చేరడం షర్మిల చేసిన రాజకీయ తప్పిదం అని అభిప్రాయపడ్డారు. షర్మిల వెనకు ఎవరున్నారో అందరికీ తెలుసు అన్నారు.

ఎన్డీఏలో చేరికపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ఎన్డీఏలో చేరాలని వైసీపీకి 2014లోనే ఆఫర్ వచ్చిందన్నారు. మేం వద్దన్నాకే బీజేపీ, టీడీపీతో జతకట్టిందని స్పష్టత ఇచ్చారు. వైసీపీ ఏ పార్టీతో జత కట్టదన్నారు. అంశాలవారీగానే గతంలో ఎన్డీఏకు మద్దతు ఇచ్చామన్నారు. ఇప్పుడు కూడా మేం కాదంటేనే టీడీపీతో బీజేపీ జట్టుకట్టిందని కుండబద్ధలు కొట్టారు. వాలంటీర్లు తమ కార్యకర్తలని తాను అనలేదని.. తమ ప్రభుత్వం నియమించిన వారు అనే చెప్పానని గుర్తు చేశారు. వాలంటీర్లలో చాలామంది వైసీపీ అభిమానులుగానే ఉంటారన్నారు.

Tags:    

Similar News