వార్ కోసం 'వారాహి' రెడీ.. యుద్ధానికి సిద్ధమవుతున్న జనసేనాని Pawan Kalyan

2024 ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

Update: 2022-12-07 12:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : 2024 ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు సినిమా కమిట్‌మెంట్స్ ఉండడం వల్ల బస్సు యాత్ర ఉంటుందా? లేదా? అనే చర్చ సాగుతుండగా... తాజాగా ఏపీలో చేపట్టనున్న తన బస్సు యాత్రపై పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చారు. దీనికి సంబంధించి తెరవెనక ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బస్సు యాత్రలో భాగంగా పవన్ వినియోగించేందుకు జనసేన పార్టీ ప్రత్యేకంగా ఒక వాహనాన్ని కూడా సిద్ధం చేసింది. బస్సు యాత్ర కోసం తయారు చేసిన వాహనం ఫొటోలను పవన్ కల్యాణ్‌ ట్విట్టర్‌ వేదికగా షేర్ చేశారు. ఫొటోలతో పాటు ఓ వీడియోను కూడా షేర్ చేస్తూ.. వారాహి ఎన్నికల సమరానికి సిద్ధం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. యుద్ధ ట్యాంక్‌ లుక్‌తో ఎన్నికల కోసం ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పవన్ షేర్ చేసిన వారాహి విజువల్స్ వీడియో గుస్‌బంప్స్ తెప్పిస్తుంది. వారాహి వీడియో సినిమాలో ఉండే సీన్‌ను తలపిస్తుంది. అయితే, పవన్ ఎప్పటినుంచి బస్సు యాత్రను ప్రారంభిస్తారు? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

 

'Varahi' is ready for Election Battle! pic.twitter.com/LygtMrp95N

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News