జనసేనానికి ఐక్యరాజ్యసమితి ఆహ్వానం..ఈ నెల 20న న్యూయార్క్ టూర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం అందింది. ఈనెల 22వ తేదీన జరగనున్న సదస్సులో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు.

Update: 2024-05-06 04:16 GMT

దిశ ప్రతినిధి,కాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం అందింది. ఈనెల 22వ తేదీన జరగనున్న సదస్సులో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. దేశం తరఫున పాటుపడే నలుగురికి మాత్రమే ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం అందుతుంది. అటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు. స్వార్థం లేని నాయకులకు మాత్రమే ఇటువంటి అవకాశం దక్కుతుందని మేధావులు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొనేందుకు ఈనెల 20వ తేదీన పవన్ కళ్యాణ్ న్యూయార్క్ బయల్దేరుతున్నారు అని సమాచారం.

Read More..

IAS పరిస్థితే ఇలా ఉంటే ఎలా.. జగన్ సర్కారుపై చంద్రబాబు సంచలన ట్వీట్ 

Tags:    

Similar News