Tirumala Samacharam: కిటకిటలాడుతున్న తిరుమల క్షేత్రం.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

కలియుగ దైవం తిరుమల భక్తులతో కిటలాడుతోంది. బుధవారం శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Update: 2024-04-11 03:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల భక్తులతో కిటలాడుతోంది. బుధవారం శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ మేరకు టెకెన్లు లేని భక్తులకు దర్శనానికి ఖచ్చితంగా 12 నుంచి 14 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా నాలుగు రోజులు గడిస్తే.. విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం అవుతుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ మరిత తగ్గే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు తెలిపాయి. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. గురువారం స్వామి వారిని 65,570 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 24,446 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News