పల్నాడులో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే భార్యపై దాడి

పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది....

Update: 2024-05-08 12:54 GMT

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాచర్లలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో పరస్పరం రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాదేవితో పాటు మరికొందరు మహిళలకు గాయాలయ్యాయి. శిరిగిరిపాడులో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఘటన జరిగింది. దీంతో రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహారెడ్డి తీరుపై మండిపడ్డారు. నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై దాడి చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న మాచర్ల నియోజకవర్గంలో జూలకంటి బ్రహ్మారెడ్డి వల్లే దాడులు జరుగుతున్నాయని రమాదేవి వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News