జగన్‌ను హతమార్చాలని చంద్రబాబు కుట్ర.. రాష్ట్ర మంత్రి సంచలన ఆరోపణలు

విజయవాడలో కుట్ర ప్రకారంగానే సీఎం జగన్‌పై దాడి జరిగిందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సోమవారం రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై జరిగిన దాడిని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించారని అన్నారు.

Update: 2024-04-15 06:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో కుట్ర ప్రకారంగానే సీఎం జగన్‌పై దాడి జరిగిందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సోమవారం రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై జరిగిన దాడిని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించారని అన్నారు. వైసీపీని రాజకీయంగా ఎదుర్కోలేకనే దాడులకు దిగుతున్నారని విమర్శించారు. జగన్‌ను హతమార్చాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. జగన్‌కు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరు అని అన్నారు.

ముగ్గురూ కలిసి ఓడించడం కష్టమని భావించి హతమార్చాలనే కుట్ర చేశారని తెలిపారు. జగన్‌పై మరోసారి దాడి జరిగితే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు, పవన్‌ను క్షమించరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనుబొమ్మ పైన తగిలింది కాబట్టి ప్రమాదం తప్పింది.. అదే కంటికో, కణితికో తగిలితే ఏమయ్యుండేది? అని ప్రశ్నించారు. వైసీపీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మన సభల్లో అల్లరి మూకలు దూరి అశాంతి, అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ప్రత్యర్థులను ఓడించేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని అన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News