లోయలోకి దూసుకెళ్లిన ఆటో..ముగ్గురి పరిస్థితి సీరియస్

ఆటో లోయలో పడిన ఘటన శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం వంబరెల్లిల దగ్గర జరిగింది..

Update: 2024-05-27 10:57 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆటో లోయలో పడిన ఘటన శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం వంబరెల్లిల దగ్గర జరిగింది. ఆటోలో పది మంది ప్రయాణికులు వెళ్తుండగా వంబరెల్లి వద్ద అదుపు తప్పింది. డ్రైవర్ కంట్రోల్ చేసే లోపే లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లోయలో పడిన ఆటోను బయటకు తీశారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు.  ఘటనకు సంబంధించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా అంచనా వేశారు. క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read More..

Breaking: యాసిడ్, గ్యాస్ లోడ్ లారీలు ఢీ.. భయం..భయం 

Similar News