శ్రీవారి సుప్రభాత సేవలో తెలంగాణ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్..

కలియుగ దైవంగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

Update: 2024-04-20 06:03 GMT

దిశ తిరుమల: కలియుగ దైవంగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కాగా తిరుమల చేరుకున్న ఎమ్మెల్యేకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనానికి ఏర్పాట్లు చేశారు.

 వివరాల్లోకి వెళ్తే.. తిరుమలలో శనివారం వేకువజామున జరిగిన స్వామివారి సుప్రభాత సేవలో తెలంగాణ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తరువాత ఆలయ రంగనాయక మండపంలో శ్రీనివాస్ యాదవ్‌కు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News