ఎప్పటికైనా షర్మిల సీఎం: రేవంత్ రెడ్డి

వైఎస్ షర్మిల ఎప్పటికైనా ఏపీకి సీఎం అయి తీరుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు...

Update: 2024-03-16 14:26 GMT

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ షర్మిల ఎప్పటికైనా ఏపీకి సీఎం అయి తీరుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విశాఖ కాంగ్రెస్ సభలో ఆయన పాల్గొన్నారు. వైఎస్ షర్మిల సీఎం అయ్యే వరకూ తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైఎస్సార్ అంటేనే వై షర్మిలా రెడ్డి అని సంభోదించారు. ఏపీ ప్రజల కష్టాలు చూసి వైఎస్ షర్మిల ఇక్కడికి వచ్చారని తెలిపారు. ఏపీ ప్రజలకు ప్రశ్నించే గొంతుకలు కావాలన్నారు. షర్మిలకు ఏపీ ప్రజలు అండగా నిలబడాలని.. చట్ట సభలకు కాంగ్రెస్ సభ్యులను పంపాలని పిలుపునిచ్చారు. షర్మిల నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. షర్మిలకు అన్ని విధాలుగా అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. షర్మిలను ఏపీకి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Read More..

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై CM రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్ 

Tags:    

Similar News