ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్‌లో సాంకేతిక లోపం.. 6 యూనిట్లలో నిలిచిన విద్యుత్

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.

Update: 2023-05-18 04:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఎన్టీటీపీఎస్‌లోని ఆరు యూనిట్లలో 1560 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్లాంట్ పవర్ గ్రిడ్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు రెండో యూనిట్లో మాత్రమే తిరిగి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఎన్టీటీపీఎస్‌లో పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు విద్యుత్ కోతలు తప్పవంటున్నారు అధికారులు.

Also Read..

Congress Focus on Ap: మాజీ ఎంపీ చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Tags:    

Similar News