అదే జగన్‌కు భస్మాసుర హస్త్రం.. నారా లోకేష్ సంచలన జోస్యం

సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు...

Update: 2024-01-20 16:40 GMT

దిశ, ఏపీ బ్యూరో: ‘రాజులు, రాజ్యాలు అంతరించిపోయాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు పొరబాటున ఐదేళ్ల క్రితం జగన్​ అనే నియంతకు అధికారమిచ్చారు. ఆయన అనాలోచిత, పిచ్చి నిర్ణయాలతో అన్నివర్గాల ప్రజలను అవస్థల పాల్జేస్తున్నారు.’అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ 40 రోజులుగా అంగన్వాడీలు ఆందోళనలు చేస్తుంటే కనీస స్పందన లేకపోగా, విధుల్లోకి చేరకపోతే ఉద్యోగాలు పీకేస్తామని సజ్జలతో బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. ప్రభుత్వ మొండివైఖరి కారణంగా ఇప్పటికే ఇద్దరు అంగన్వాడీ చెల్లెమ్మల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయని లోకేష్​ విచారం వ్యక్తం చేశారు.

జగన్ అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మా ఆయన పాలిట భస్మాసుర హస్తంగా మారబోతోందని లోకేష్​ హెచ్చరించారు. ఎంతటి నియంత అయినా ప్రజాభీష్టానికి తలొగ్గక తప్పదన్న చారిత్రక సత్యాన్ని గుర్తించలేని జగన్... మరో 3 నెలల్లోపే ఇంటికి వెళ్లడం ఖాయమని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా బెదిరిపోకుండా న్యాయమైన డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. టీడీపీ– జనసేన నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని లోకేష్​ హామీనిచ్చారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News