Breaking: ఆంధ్రాలో ఆగని ఫ్లెక్సీ వార్.. ఆ పార్టీ హోర్డింగులు ధ్వంసం..

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార పక్షానికి విపక్షాలకు మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది.

Update: 2024-02-25 07:28 GMT

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార పక్షానికి విపక్షాలకు మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది. ముఖ్యంగా టీడీపీ వైసీపీ మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆ మాటల యుద్ధం ముదిరి ఫ్లెక్సీ వార్ గా మారింది. తాజాగా గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. ఉండవల్లి లోని కరకట్ట పై ఉన్న తెలుగుదేసం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఉన్న ఫ్లెక్సీలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు.

గుర్తు తెలియని యువకులు కర్రలతో ఫ్లెక్సీలను కొడుతూ అవాటిని నాశనం చేశారు. కాగా ఈ ఘటనపై స్పందినచిన టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలే ఈ పని చేశారని ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఫ్లెక్సీ వార్ జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు కోకొల్లలు. గతంలో జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్న ఫ్లెక్సీని అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

అలానే సంక్రాంతి అప్పుడు ఆంధ్రప్రదేశ్ కి వెళ్తున్న ప్రజలకు జనసేన సూచనలుగా వైసీపీని ఎద్దేవ చేస్తూ విజయవాడ హైవే పైన జనసేన ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే చోటు చేసుకోగా గత కొంతకాలంగా సద్దుమణిగింది అనుకున్న ఫ్లెక్సీ వార్ మళ్ళీ మోడలింది. 

Tags:    

Similar News