టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు.. కారణమిదే..!
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ టీడీపీ పార్టీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది.
దిశ, వెబ్డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ టీడీపీ పార్టీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. టీడీపీకి ఎన్నికల కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న.. లోకేష్పై చర్యలు తీసుకోవాలని మల్లాది విష్ణు ఈసీని కోరారు. దీంతో అడిషనల్ సీఈవో టీడీపీకి తాజాగా నోటీసులు జారీ చేశారు. టీడీపీకి ఈసీ నోటీసులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.