భయపడకండి.. మీ ప్రాణానికి నా ప్రాణమైన అడ్డువేస్తా: చంద్రబాబు

సీఎం జగన్, వైసీపీ సర్కార్‌‌పై టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు.

Update: 2024-03-28 07:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్, వైసీపీ సర్కార్‌‌పై టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. నిన్నటి వరకు బెదిరించారు.. కేసులు పెట్టారు.. ఇవాళ్టి నుండి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.. మీ ప్రాణానికి నా ప్రాణమైనా అడ్డువేస్తాని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగా సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందుకు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చాడు.. తీరా ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నాడని మండిపడ్డారు.

సామాన్యులకు నెలకు అదనంగా రూ.500 కరెంట్ బిల్లు వస్తోందన్నారు. ఐదేళ్ల టీడీపీ హయాంలో ఎప్పుడూ కరెంట్ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 9 సార్లు కరెంట్ ఛార్జీలు బాదుడే బాదుడు అని ఎద్దేవా చేశారు. రైతుల మోటార్లకు మీటర్లు బిగించి.. వాళ్ల మెడలకు ఉరితాడు బిగించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రజాగళం సూపర్ హిట్ అయ్యిందని.. జగన్ సిద్ధం కార్యక్రమంలో అట్టర్ ప్లాఫ్ అయ్యిందని సెటైర్ వేశారు. బిర్యానీ, మద్యం, మనీ ఇచ్చిన జగన్ సభలకు జనం రావడం లేదని ఎద్దేవా చేశారు.

Similar News