తిరుమలలో రోడ్డు ప్రమాదం.. తమిళ భక్తులకు గాయాలు

తిరుమలలో జరిగిన రోడ్డు ప్రమాదంతో తమిళనాడు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ..

Update: 2024-01-01 15:16 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో జరిగిన రోడ్డు ప్రమాదంతో తమిళనాడు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా వెంకన్న సేవలో పాల్గొన్న భక్తులు తిరిగి తమిళనాడుకు పయనమయ్యారు. తిరుమల 34వ మలుపు వద్దకు రాగానే కారు బోల్తా పడింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేయడంతో అదుపు తప్పింది. ఈ ఘటనలో భక్తులకు స్వల్ప గాయాలయ్యారు. వీరికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం భక్తులు తిరిగి తమిళనాడుకు వెళ్లిపోయారు. అయితే ఘటనా స్థలంలోనే బోల్తా పడిన ఉండిపోయింది. మంగళవారం కారును అక్కడి నుంచి తొలగించనున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల శ్రీవారే తమను కాపాడారని భక్తులు తెలిపారు.

Read More..

8 జీవాలకు.. న్యూ లైఫ్.. యానిమల్ వారియర్స్ నయా సాల్ సక్సెస్ ఆపరేషన్.. 

Tags:    

Similar News