Chouta Bhimavaram సచివాలయానికి తాళం

నెల్లూరు జిల్లా చౌట భీమవరం గ్రామ సచివాలయానికి తాళం వేశారు. సచివాలయం సిబ్బందిని బయటకు పంపి గ్రామస్తులతో కలిసి సర్పంచ్ తాళాలు వేయడం చర్చనీయాంశమైంది....

Update: 2023-01-29 15:34 GMT
  • తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

దిశ, నెల్లూరు: నెల్లూరు జిల్లా చౌట భీమవరం గ్రామ సచివాలయానికి తాళం వేశారు. సచివాలయం సిబ్బందిని బయటకు పంపి గ్రామస్తులతో కలిసి సర్పంచ్  తాళాలు వేయడం చర్చనీయాంశమైంది. ఎన్నో ఏళ్లుగా చౌట భీమవరంలో 36 కుటుంబాల వారు కొంత భూమిని సాగు చేసుకుంటున్నారని సర్పంచ్ తెలిపారు. అధికారులను, ప్రజా ప్రతినిధులను కలిసి ఆ భూమికి హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. బయట వ్యక్తులు వచ్చి పొలాల్లో కంచె వేస్తున్నారని, దీనిపై అధికారులను అడిగితే ఏ మాత్రం పట్టించుకోవడంలేదని తెలిపారు. ఈ కారణంగానే గ్రామ సచివాలయానికి తాళాలు వేసి నిరసన తెలియజేస్తున్నామని సర్పంచ్, గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ పొలాలకు హక్కులు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

Similar News