వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరికి మరోసారి భద్రత పెంపు

వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరికి భద్రత పెంచారు...

Update: 2024-04-24 15:58 GMT

దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరికి భద్రత పెంచారు. జై భారత్ పార్టీ అభ్యర్థిగా గురువారం ఆయన నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో బుధ, గురువారం ఆయన భద్రతను పెంచుతూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. 3+3, 4+4‌గా ఉన్న భద్రతను 10+10కు పెంచారు. అయితే తనను పులివెందులలో సీఎం జగన్, ఎంపీ అవినాశ్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నారని దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు. తన నామినేషన్‌ను అడ్డుకోవాలని వైసీపీ నేతలు చూస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ నామినేషన్ వేసినప్పుడే తాను దాఖలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దేనికీ భయపడడని, దీటుగా ఎదుర్కొంటానని చెప్పారు. తన రాళ్ల దాడికి ప్రయత్నాలు చేసినట్లు తనకు సమాచారం ఉందని దస్తగిరి స్పష్టం చేశారు. 

Similar News