12 ఏళ్ల తర్వాత మొగల్తూరుకు ప్రభాస్.. ఘనంగా కృష్ణంరాజు సంస్మరణ సభ

రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభకు ఆయన స్వగ్రామమైన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం జరుగనున్న ఈ సభకు ప్రముఖ సినీ నటులతో పాటు ఏపీకి చెందిన పలువురు

Update: 2022-09-29 08:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభను ఆయన స్వగ్రామమైన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం జరుగనున్న ఈ సభకు ప్రముఖ సినీ నటులతో పాటు ఏపీకి చెందిన పలువురు మంత్రులు, కీలక రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. అయితే, సంస్మరణ సభ నేపథ్యంలో దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ మొగల్తూరుకు రావడంతో చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. కొంతమంది అభిమానులు పట్టణంలో భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్మరణ సభకు వచ్చిన రెబల్ స్టార్ అభిమానులను ఆప్యాయంగా పలకరించిన ప్రభాస్.. అందరూ భోజనం చేసి వెళ్లాలని కోరాడు. కాగా, ఈ సంస్మరణ సభలో 50కి పైగా వంటకాలతో సుమరు లక్షమందికి భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..

Also Read:   నెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి అప్‌కమింగ్ మూవీస్.. ఒక్కో సినిమాకు ఎంతో తెలుసా? 

Tags:    

Similar News