చిలకలూరిపేట సభలో ప్రధాని మోడీకి ఘోర అవమానం: మాజీ మంత్రి పేర్ని నాని

ఏపీలో కాంగ్రెస్, వైసీపీ ఒక్కటేనని ప్రధాని మోడీ చిలకలూరిపేట సభలో చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-03-17 15:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కాంగ్రెస్, వైసీపీ ఒక్కటేనని ప్రధాని మోడీ చిలకలూరిపేట సభలో చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లి ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్ మరణానికి కారణం కాంగ్రెస్ పార్టీ.. అలాంటి కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఒక్కటే అంటే టీడీపీ, బీజేపీ కార్యకర్తలు కూడా నమ్మరని ఎద్దేవా చేశారు. ఏఐసీసీకి పేర్ని నాని కొత్త అర్థం చెప్పారు. ఏఐసీసీ అంటే ఆలిండియా చంద్రబాబు కమిటీ అని సెటైర్ వేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులతో మీకు తప్ప ప్రజలకు ఏం లాభమని ప్రశ్నించారు. ప్రజా గళం సభలో ప్రధాని మోడీ పక్కన కూర్చున్నవారంతా గజ దొంగలేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పోలవరం ప్రాజెక్టును టీడీపీ ఏటీఎంలా వాడుకుందని గతంలో మోడీ చెప్పారు.. అవినీతి చేసిన బాబును మీరు ఏ జలాలతో శుద్ధి చేశారని ప్రధానిని ప్రశ్నించారు. అవకాశవాద పొత్తులతో రాష్ట్రానికి ఏం అవసరమని ఫైర్ అయ్యారు. చిలకలూరిపేటలో మూడు పార్టీల సభ వెలవెలబోయిందని ఎద్దేవా చేశారు. సరిగ్గా సభ జరుపుకోవడం చేతికాని వారు కూడా జగన్‌పై యుద్ధం అంటున్నారని సెటైర్ వేశారు. సభలో ప్రధాని మోడీకి ఘోర అవమానం జరిగిందని.. ప్రసంగిస్తుంటే సడెన్‌గా మైక్ మూగబోవడంతో ఆయన బొమ్మలా నిలబడ్డారని అన్నారు. చంద్రబాబు మళ్లీ మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌కు వెన్నపోటు పొడిచి.. ఆయన చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు అని తీవ్ర ఆరోపణలు చేశారు.

Read More..

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసుల దృష్టి

Tags:    

Similar News