Ap News: విజృంభించిన విష జ్వరాలు..40 మందికి పైగా అస్వస్థత

పార్వతీపురం మన్యం జిల్లాలో విష జ్వరాలు విజృంభించాయి....

Update: 2024-05-25 06:01 GMT

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లాలో విష జ్వరాలు విజృంభించాయి. కొమరాడ మండలం అంటివలస ప్రజలు నాలుగు రోజులుగా విషజ్వరాలతో మంచంపట్టారు. 40 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారికి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నాలుగు రోజులుగా విషజ్వరాలు అదుపులోకి రాకపోవడంతో మిగిలిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా విషజ్వరాలు వస్తాయేమనని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, వైద్యులు అప్రమత్తమయ్యారు. అంటివలసలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలో పారిశుధ్యం క్షిణించడం వల్లే విష జ్వరాలు వ్యాప్తి చెందాయని గుర్తించారు. వీధుల్లో ఎక్కడి మురుగు అక్కడే నిలిచిపోయినట్లు నిర్ధారించారు. కాలువల్లో పూడిక తీత సక్రమంగా లేక మురుగు నిలిచిపోయవడంతోనే విష జ్వరాలు చెలరేగాయని గ్రామస్థులు అంటున్నారు.

Similar News