వారాహి వాహనంలోనే సభా స్థలికి పవన్ కల్యాణ్.. వచ్చే రూట్ ఇదే!

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన జనసేన దిగ్విజయభేరి సభకు పవన్ కల్యాణ్ హాజరుపై ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

Update: 2023-03-14 08:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన జనసేన దిగ్విజయభేరి సభకు పవన్ కల్యాణ్ హాజరుపై ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. 12గం.30.ని.లకు నోవాటెల్ హోటల్ నుంచి పవన్ కల్యాణ్ బయలు దేరతారని తెలిపింది. 1గంటకు ఆటోనగర్ ప్రాంతానికి పవన్ కల్యాణ్ చేరుకుని అక్కడి నుంచి వారాహి వాహనం ద్వారా జనసేన ఆవిర్భావ సభ, మచిలీపట్నం బయలుదేరుతారని ప్రకటనలో తెలిపింది. ఆటోనగర్ నుంచి తాడిగడప జంక్షన్, పోరంకి జంక్షన్, పెనమలూరు జంక్షన్, పామర్రు – గుడివాడ సెంటర్ (బైపాస్), గూడూరు సెంటర్ మీదుగా సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నంలోని సభా ప్రాంగణానికి పవన్ కల్యాణ్ చేరుకుంటారని ప్రకటనలో తెలిపింది. ఆవిర్భావ సభ వేదికపై కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

Read more:

ఆవిర్భావం వేళ.. జనసేన పార్టీకి ఆ దేశం నుంచి భారీ విరాళం

Tags:    

Similar News