ఆ పార్టీ తరఫున ప్రచార రంగంలోకి ఎన్టీఆర్ తనయుడు

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు 12 రోజులే ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీల నేతలు సభలు సమావేశలతో విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.

Update: 2024-05-01 08:29 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు 12 రోజులే ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీల నేతలు సభలు సమావేశలతో విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం రంగంలోకి సీనియర్ ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారని సమాచారం.వివారల్లోకి వెళితే.. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలోకి ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ రాబోతున్నారు. ఏన్డీయే తరఫున ఎన్నికల ప్రచారానికి నేడు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించనున్నారు. అనంతరం గుడివాడ, పెడన, పామర్రు నియోజకవర్గంలో నందమూరి రామకృష్ణ ప్రచారంలో పాల్గొననున్నారు.

Tags:    

Similar News