అర్చక సోదరులపై వైసీపీ నేత దాడి దుర్మార్గం :Nara Lokesh

రాష్ట్రంలో వైసీపీ మూకల అరాచకానికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు.

Update: 2024-03-26 11:00 GMT

దిశ,కాకినాడ:రాష్ట్రంలో వైసీపీ మూకల అరాచకానికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు.అయిదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ ఒక్క వర్గమూ ప్రశాంతంగా జీవనం సాగించలేని పరిస్థితులు కల్పించారని, తమ ఆటవిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని తెలిపారు.ఈ మేరకు ఆయన అర్చకులపై జరిగిన దాడిని ఖండించారు.

వివరాల్లోకి వెళితే శివాలయంలో పూజ సరిగా చేయలేదంటూ కాకినాడలో వైసీపీ నేత సిరియాల చంద్రరావు ఆలయం గర్భగుడిలో స్వైరవిహారం చేసి పూజారులపై దాడికి తెగబడ్డారు.భగవంతుడి సేవ తప్ప మరో ధ్యాస లేని అర్చకులపై ప్రతాపం చూపడం దుర్మార్గం. కాకినాడలో ఆలయ పూజారులపై దాడి చేసిన వైసీపీ నేతను తక్షణమే అరెస్ట్ చేయాలని,మరో 2 నెలల్లో ప్రజా ప్రభుత్వం రాబోతుంది.ఈలోగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తమ రోజువారీ కార్యకలాపాలను స్వేచ్చాయుత వాతావరణంలో నిర్వహించుకునేలా చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి తెలియ చేస్తున్నట్లు నారా లోకేశ్ లేఖ ద్వారా తెలిపారు.

Tags:    

Similar News