దిశ, వెబ్డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం నుంచి నారా లోకేష్ 'యువగళం' పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా వరదరాజులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆపై హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు కుప్పంకు తరలివచ్చారు. దీంతో పసుపు జెండాలు, టీడీపీ శ్రేణులతో కుప్పం సందడిగా మారిపోయింది.