Ap Capitalపై మంత్రి బుగ్గన మరోసారి సంచలన కామెంట్స్

త్వరలో విశాఖ నుంచే పాలన అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు......

Update: 2023-02-15 15:47 GMT

దిశ, వెబ్ డెస్క్: త్వరలో విశాఖ నుంచే పాలన జరుగుతుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ రాజధాని అంశంపై ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రీకరణే మంచిదని శివరామకృష్ణ కమిటీ చెప్పిందని గుర్తు చేశారు. మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలో 8 రాష్ట్రాల్లో కూడా కోర్టు ఒక చోట, రాజధాని ఒక చోట ఉందని బుగ్గన పేర్కొన్నారు. 

కాగా బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన  మూడు రాజధానులనేవి లేవని.. విశాఖే రాజధాని అని చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో ప్రతిపక్షాలన్ని కూడా ప్రభుత్వాన్ని తప్పుబట్టాయి. విశాఖ రాజధాని చేయడం కోసమే మూడు రాజధానులను తెరపైకి తీసుకోచ్చాయని విమర్శలు చేశాయి. దీంతో మంత్రి బుగ్గన వివరణ ఇచ్చారు. 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News