Minister Ambati: నోరు అదుపులో పెట్టుకో Chandrababu

రాష్ట్రంలో వాలంటీర్లపై టీడీపీ విషం చిమ్ముతోందని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు క్రిమినల్స్, దోపిడీదారులు కాదని ఆయన తెలిపారు. ...

Update: 2022-12-11 12:26 GMT

దిశ వెబ్ డెస్క్: రాష్ట్రంలో వాలంటీర్లపై టీడీపీ విషం చిమ్ముతోందని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు క్రిమినల్స్, దోపిడీదారులు కాదని ఆయన తెలిపారు. వాలంటీర్లు తప్పు చేస్తే వెంటనే తీసేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నోరు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం కలేనని ఎద్దేవా చేశారు. 175 సీట్లకు 175 సీట్లతో వైసీసీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంబటి ధీమా వ్యక్తం చేశారు.

కాగా వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టిన సీఎం జగన్.. ఇటీవల కొత్త వ్యవస్థను ప్రకటించారు. ప్రతి యాభై ఇళ్లకు వైసీపీ ప్రతినిధిని నియమించారు. ప్రభుత్వ పథకాలు, చేపట్టిన కార్యక్రమాలను వీరు ప్రజలకు వివరిస్తారు. దీంతో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం చేస్తోంది టీడీపీనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో టీడీపీ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Uppadaలో Tdp Bc సదస్సుకు సన్నాహాలు

Tags:    

Similar News