ఏపీ వాసులకు ముఖ్య గమనిక.. రేపు కూడా ఆ జిల్లాల్లో వర్షాలు..!

ఏపీలో శనివారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది...

Update: 2024-05-10 09:09 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో శనివారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నట్లు వెల్లడించింది. శనివారం సైతం వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ పట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవే జిల్లాలో ఏలూరు జిల్లా మినహా అన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు శనివారం సైతం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ సమయంలో అక్కడకక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని, రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రాంతాల్లో ఉండొద్దని వాతావరణ శాఖ పేర్కొంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News