లోకేశ్! నెక్ట్స్ జైలుకెళ్లేది నువ్వే: మంత్రి మేరుగ నాగార్జున

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే జైలుకు వెళ్లారని తర్వాత వెళ్లేది ఆయన తనయుడు నారా లోకేశ్ అని ఏపీ సాంఘిక శాఖ మంత్రి మంత్రి మేరుగు నాగార్జున చెప్పుకొచ్చారు.

Update: 2023-09-12 07:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే జైలుకు వెళ్లారని తర్వాత వెళ్లేది ఆయన తనయుడు నారా లోకేశ్ అని ఏపీ సాంఘిక శాఖ మంత్రి మంత్రి మేరుగు నాగార్జున చెప్పుకొచ్చారు. లోకేశ్ జైలుకు వెళ్లేందుకు సిద్ధంగగా ఉండాలని హెచ్చరించారు. చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచేశాడని ఇప్పుడు పాపం పండి చివరికి జైలు పాలయ్యాడు అని చెప్పుకొచ్చారు. మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి మేరుగ నాగార్జున చట్టానికి దొరికిన దొంగ చంద్రబాబు అంటూ ఘటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జీవితమంతా అవినీతిమయం. చట్టాలు చంద్రబాబుకు చుట్టాలు కావు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఇంకా అనేక కేసుల్లో ఇరుక్కుంటారన్నారు. త్వరలో నారా లోకేశ్‌ కూడా ముద్దాయి కాబోతున్నాడు అని హెచ్చరించారు. లోకేశ్‌ ముందు బూతులు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. తాము కూడా మీలాగ మాట్లాడితే తట్టుకోలేరు అని మంత్రి మేరుగ నాగార్జున హెచ్చరించారు. 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News