Srisalam: 22 రోజుల్లో భారీగా హుండీ ఆదాయం

భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి ఉభయదేవాలయాల హుండీల ఆదాయం 2 కోట్ల 87 లక్షల 01 వేల 092 రూపాయలు వచ్చినట్లు ఈఓ లవన్న వెల్లడించారు...

Update: 2023-03-16 16:12 GMT

దిశ, శ్రీశైలం: భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి ఉభయదేవాలయాల హుండీల ఆదాయం 2 కోట్ల 87 లక్షల 01 వేల 092 రూపాయలు  వచ్చినట్లు ఈఓ లవన్న వెల్లడించారు. అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన భద్రత నడుమ హుండీ లెక్కింపు నిర్వహించామని ఆయన తెలిపారు. గడిచిన 22 రోజుల్లో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని హుండీల్లో కానుకల రూపంలో ఈ డబ్బులు సమర్పించారని చెప్పారు. నగదుతోపాటు 162 గ్రాముల బంగారం 7 కేజీల 110 గ్రాముల వెండీ కూడా వచ్చినట్లు ఈఓ లవన్న తెలిపారు. హుండీ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు , సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారని ఆయన చెప్పారు. 

Tags:    

Similar News