Srisailam: చిరుత సంచారం.. భయాందోళనలో గురుకుల విద్యార్థులు

శ్రీశైలంలో వీరశైవ గురుకులం వద్ద చిరుతపులి సంచారం కలకలం రేగింది....

Update: 2023-05-29 12:13 GMT

దిశ, శ్రీశైలం: శ్రీశైలంలో వీరశైవ గురుకులం వద్ద చిరుతపులి సంచారం కలకలం రేగింది. చిరుత పులి సంచరిస్తుండగా గురుకుల పాఠశాలలో పిల్లలు చూసి భయాందోళనకు గురయ్యారు. గట్టిగా అరవడంతో పులి అడవిలోకి పారిపోయింది. అయితే పులి సంచరిస్తుండగా పాఠశాలలో ఉన్న కొంతమంది విద్యార్థులు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. చాలా సార్లు చిరుత పులులు తిరుగుతున్నాయని, ప్రతి నెల చిరుతపులిలు కనపడుతూనే ఉన్నాయని తెలిపారు. ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Tags:    

Similar News