Breaking: సీఎం జగన్ పర్యటన వాయిదా

సీఎం జగన్ మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన వాయిదా పడింది...

Update: 2024-03-02 06:25 GMT

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన వాయిదా పడింది. ఈ నెల 4న కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఆయన పర్యటించాల్సి ఉంది. ఇప్పటికే ఈ మేరకు మంత్రి బుగ్గన ఏర్పాట్లు చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల సీఎం జగన్ పర్యటన వాయిదా పడినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు మరో రోజు ఖరారు చేసి సీఎం జగన్ పర్యటన షెడ్యూల్‌ను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

కాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అన్నీ సీట్లు గెలిచే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించారు. ఈ షెడ్యూల్‌లో భాగంగా ఈ నెల 4న కర్నూలు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయాలని ప్లాన్ చేశారు. కానీ సడెన్‌గా ఆయన కర్నూలు టూర్‌ను వాయిదా వేసుకున్నారు. 

Read More..

ఆ నాలుగు పార్లమెంట్ స్థానాలపై జగన్ ఫోకస్.. ఇంచార్జులు వీరేనా..?  

Tags:    

Similar News