విజయవాడలో భారీగా డబ్బు, బంగారం పట్టివేత

విజయవాడలో ఎన్నికల ఫ్లయింగ్ స్వ్కాడ్ తనిఖీలు నిర్వహించింది....

Update: 2024-03-22 17:14 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో ఎన్నికల ఫ్లయింగ్ స్వ్కాడ్ తనిఖీలు నిర్వహించింది. ఓ కారులో నగదు తరలిస్తున్నారన్న సమాచారంతో సోదాలు చేశారు. ఈ సోదాల్లో కోటి 50 లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. గాదె రాంబాబు అనే వ్యక్తి కారులో తరలిస్తుండగా విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేసన్ పరిధిలో ఈ నగదును పట్టుకున్నారు. నగదు, బంగారం మొత్తం కలిపి రూ. 1.6 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ డబ్బుకు సరైన పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేశారు. ఐటీ, జీఎస్టీ శాఖకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News