Breaking: చంద్రబాబు ఉండవల్లి నివాసం జప్తుపై తీర్పు వాయిదా

ఏపీ సీఐడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా పడింది. చంద్రబాబు ఉండవల్లి నివాసం జప్తు చేసేందుకు అనుమతి కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ..

Update: 2023-05-31 12:56 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఐడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా పడింది. చంద్రబాబు ఉండవల్లి నివాసం జప్తు చేసేందుకు అనుమతి కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం విచారణను జూన్ 2 వరకు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింి.

కాగా చంద్రబాబు ఉండవల్లి నివాసం జప్తులో సీఐడీ మరో ముందడుగు వేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ మార్పుకు సంబంధించిన అవినీతి వ్యవహారంలో చంద్రబాబు నివాసం, మాజీ మంత్రి నారాయణతోపాటు ఆయన సంబంధీకుల ఆస్తులపై సీఐడీ నివేదిక ప్రకారం అటాచ్ మెంట్‌కు హోంశాఖ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో సీఐడీ న్యాయపరమైన అనుమతి కోరడంతో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

అమరావతి నగర ప్రణాళిక .. రింగ్ రోడ్డు వ్యవహారంలో అవినీతి చోటు చేసుకుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్‌కే ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ చాలా కోణాల్లో విచారణ చేపట్టింది. గతేడాది మే నెలలో ఈ కేసు నమోదైంది. వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు అనుకూలంగా నాటి ప్రభుత్వం క్విడ్ ప్రోకోకు పాల్పడిందని అభియోగాలు నమోదయ్యాయి. లింగమనేని రమేష్‌కు లబ్ధి చేకూర్చేలా రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో మార్పులు జరిగాయని నిర్ధారణకు వచ్చింది. అయితే లింగమనేని ఇంటిని అమ్మకుండా నిరోధించేందుకు క్రిమినల్ అమెండ్‌మెండ్ ఆర్డినెన్స్ 1944 కింద జప్తు చేసేందుకు, తదుపరి చర్యల కోసం సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. 

Tags:    

Similar News