Breaking: నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్ మోహన్ రెడ్డి, మంత్రి అంబటి, కాపు నేత ముద్రగడ పద్మనాభంపై నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు....

Update: 2024-04-21 16:47 GMT

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి, మంత్రి అంబటి, కాపు నేత ముద్రగడ పద్మనాభంపై నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను బటన్ రెడ్డి అని వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో వైసీపీ మూడు సీట్లు గెలిస్తే ముద్రగడ ఇంట్లో సర్వెంట్‌గా పని చేస్తానని పృథ్వీరాజ్ సవాల్ విసిరారు. అంబటి రాంబాబు ఓడిపోవడం ఖాయమని చెప్పారు. ఆ తర్వాత సంక్రాంతి సంబురాల్లో అంబటి లక్ష రూపాయలు తీసుకుని డ్యాన్సులు వెళ్లిపోతారని పృథ్వీరాజ్ సెటైర్లు వేశారు.

కాగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నాయకుల చేస్తున్న విమర్శలకు నటుడు, జనసేన నాయకుడు పృథ్వీరాజ్ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. పవన్‌పై ఒక్క విమర్శ చేసిన వెంటనే స్పందిస్తున్నారు. మంత్రి అంబటిపై అయితే పంచ్‌లు మీద పంచ్‌లు ఇస్తున్నారు.  ఇప్పటికే పలుమార్లు విమర్శలు చేశారు. తాజాగా పవన్  కల్యాణ్‌పై సీఎం జగన్, మంత్రి అంబటి, ముద్రగడ చేసిన వ్యాఖ్యలపై పృథ్వీరాజ్ స్ట్రాంగ్ వార్నింగ్ సంచలన సవాల్ విసిరారు. మరి పృథ్వీరాజ్ సవాల్‌ను స్వీకరిస్తారేమో చూడాలి. 

Tags:    

Similar News