Janasena ఎందుకు రౌడీ సేన?

జనసేన పార్టీ రౌడీసేన పార్టీ అంటూ నర్సాపురం బహిరంగ సభలో..Janasena Leader Nadendla Manohar counter Cm Ys Jagan Comments

Update: 2022-11-21 10:44 GMT
  • కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నందుకా?
  • ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకా?
  • తమ వ్యాఖ్యల్లో అసహనం, ఆందోళన కనిపిస్తున్నాయి
  • సీఎం జగన్‌కు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కౌంటర్

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన పార్టీ (Janasena Party) రౌడీసేన పార్టీ అంటూ నర్సాపురం బహిరంగ సభలోJanasena Leader Nadendla Manohar counter Cm Ys Jagan Commentsనసేన పార్టీ ఎందుకు రౌడీ సేన పార్టీ అంటూ ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న జనసేన పార్టీ కార్యకర్తలను కించపరిచేలా చేస్తు్న్న వ్యాఖ్యలు తమలో పేరుకున్న అసహనాన్ని, ఆందోళనను తెలియజేస్తున్నాయంటూ మండిపడ్డారు.


ఈ మేరకు ట్విటర్ వేదికగా ఎందుకు రౌడీసేన అయ్యిందో చెప్పాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తమ అసమర్థత వల్ల ఉసురు తీసుకున్న కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నందుకా? అని ప్రశ్నించారు. తమకు గుడ్ మార్నింగ్ చెప్పి రోడ్ల దుస్థితిని తెలిపినందుకా? అంటూ ప్రశ్నించారు. 'మీ సొంత జిల్లాలో వరద బాధితులను గాలికొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపినందుకా?, ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకా?, నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలపై పోరాడుతున్న జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌ను, వీర మహిళలను, జన సైనికులను జనసేన పార్టీని కించపరుస్తూ తమరు చేస్తున్న వ్యాఖ్యలు మీలో పేరుకున్న అసహనాన్ని, ఆందోళనను చెబుతున్నాయని నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు.

AP News: ఎవరు సీమ ద్రోహులు? 

Tags:    

Similar News