Supreme Courtలో జగన్ ఆస్తుల కేసు.. నిందితుడికి చుక్కెదురు

జగన్ ఆక్రమాస్తుల కేసు విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. విచారణలో నిందితుడు బ్రహ్మానందరెడ్డికి చుక్కెదురు అయింది. వ్యాన్ పిక్ భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లు గతంలో సీబీఐ కేసు దాఖలు చేసింది..

Update: 2022-12-09 11:46 GMT

దిశ వెబ్ డెస్క్: జగన్ ఆక్రమాస్తుల కేసు విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. విచారణలో నిందితుడు బ్రహ్మానందరెడ్డికి చుక్కెదురు అయింది. వ్యాన్ పిక్ భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లు గతంలో సీబీఐ కేసు దాఖలు చేసింది. ఈ కేసులో ఐఆర్ఎస్ అధికారి బ్రహ్మారెడ్డిని నిందితుడిగా చేర్చింది. దీంతో తనపై పెట్టిన సీబీఐ కేసును కొట్టివేయాలని నిందితుడు బ్రహ్మానందరెడ్డి ఈ ఏడాది జులైలో తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. బ్రహ్మానందరెడ్డిపై ఉన్న ఆరోపణలను పరిగణననలోకి తీసుకుని క్వాష్‌ను నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టును బ్రహ్మానందరెడ్డి ఆశ్రయించారు. సీబీఐ తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని, అలాగే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు ధర్మసనం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అంతేకాదు జోక్యం చేసుకునే అంశాలు కూడా ఏమీ లేవని తెలిపింది. 

Also Read....

రూ.5 కోట్లు అప్పు చేసిన Pawan Kalyan 

Tags:    

Similar News