AP Politics:జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది:ఎమ్మెల్సీ

జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అందుకే రాష్ట్రంలో అరాచకం సృష్టించి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ప్లాన్ చేశాడని శాసనమండలి సభ్యులు మహమ్మద్ ఇక్బాల్ విమర్శించారు.

Update: 2024-05-24 13:46 GMT

దిశ ప్రతినిధి,గుంటూరు: జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అందుకే రాష్ట్రంలో అరాచకం సృష్టించి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ప్లాన్ చేశాడని శాసనమండలి సభ్యులు మహమ్మద్ ఇక్బాల్ విమర్శించారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. 2019లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ఎక్కడ కూడా గులక రాళ్ల దాడి జరగలేదు. కోడి కత్తి పోట్లు లేవు. ప్రతిపక్షంలో ఉన్న జగన్ పాదయాత్ర నిర్వహించినా ఎక్కడికి వెళ్లినా ఎక్కువ భద్రతను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కల్పించింది. నేడు జగన్ రెడ్డి, ఆయన తొత్తులు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ..గెలుపే లక్ష్యంగా టీడీపీ నేతలపై దాడులు, హింసకు తెగబడ్డారన్నారు.

పల్నాడు, తిరుపతి, చంద్రగిరి, నరసరావుపేటలతో పాటు చాలా చోట్ల విధ్వంసం, రక్తపాతం సృష్టించారని ఆరోపించారు. పిన్నెల్లి అరాచకం ప్రజలందరూ చూసిన గుర్తు తెలియని వ్యక్తులని 324 కేసు పెట్టడం దారుణం. వెంటనే 307 కేసు పెట్టి ఉంటే పిన్నెల్లికి బెయిల్ వచ్చేది కాదు. వైసీపీ గుండాల అరాచకంతో శేషగిరిరావు ఊరు విడిచి పొలాల్లో ఉంటున్నా పరిస్థితి నెలకొంది. శేషగిరిరావును హత్య చేయాలని చూసిన కేసు పెట్టలేదు. మాచర్లలో ప్రజలు భయాందోళనలో ఉన్నారనీ ఇక్బాల్ చెప్పారు. పిన్నెల్లి దౌర్జన్యంగా 74 పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పై దాడులకు తెగబడ్డారు.

వైసీపీ దాడులతో 100 ముస్లిం కుటుంబాలు సొంత ఊరు విడిచిపోయారనీ పేర్కొంటూ బీసీ వ్యక్తి చంద్రయ్యను సినిమా తరహాలో దారుణంగా గొంతు కోసి చంపారు. పిన్నెల్లి రామకృష్ణ మంత్రి పదవి ఆశించి రాకపోవడంతో జగన్ రెడ్డి పిన్నెల్లికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దీంతో పిన్నెల్లి ఇష్టానుసారంగా దోచుకున్నాడు. దాదాపు రూ. 2000 కోట్లు కొల్లగొట్టారు. నియోజకవర్గంలో రెచ్చిపోయాడు. అడ్డు అదుపు లేకుండా బరితెగించి ప్రవర్తించాడు. తెలంగాణ బార్డర్‌లో చెక్ పోస్టులు పెట్టి కమీషన్ లు దండుకున్నాడనీ తెలిపారు.

జగన్ రెడ్డి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశాడు. పోలీసులు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్లలో తాబేదారులను నియమించుకున్నాడని వారు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారనీ ఎమ్మెల్సీ ఇక్బాల్ వివరిస్తూ ప్రజాస్వామ్యంగా గెలవలేమని భావించి దండుకున్న డబ్బులను పంచి గెలవాలని జగన్ రెడ్డి కుట్ర చేశారనీ ఎర్రగొండపాలెం, పుంగనూరులో చంద్రబాబుపై దాడులు చేయించి మళ్లీ టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ మాత్రమే ఉండాలని ఎలక్షన్ జరగనివ్వకూడదని వైసీపీ నేతలు యత్నించారు. లేని కారుచిచ్చు రగిలించి రక్తపాతాన్ని సృష్టించారన్నారు.

పిన్నెల్లి, పెద్దారెడ్డి లాంటి వేటగాళ్లకు మద్దతు తెలుపుతున్న జగన్ రెడ్డి పాలన వద్దని ప్రజలకు మేలు చేసే నాయకులు కావాలని.. జనం చంద్రబాబును గెలిపించాలని డిసైడ్ అయ్యారు. జగన్ రెడ్డి అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశారు. విద్యావస్థను భ్రష్టుపట్టించి బైజూస్ కు వేల కోట్లు కట్టబెట్టి కమిషన్ లు దండుకున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నాడు. 2019 లో చంద్రబాబు ప్రజల తీర్పును ఆమోదించారు. జూన్ 4న బాక్సులు బద్దలయ్యేలా ప్రజా ఆమోదంతో టీడీపీ అఖండ మెజార్టీతో గెలవబోతుంది అన్నారు.

Similar News