దోపిడీని తప్ప ప్రేమలను పట్టించుకోడు జగన్..చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక రేపటితో రాష్ట్రంలో ప్రచారం గడువు ముగుస్తుంది.

Update: 2024-05-10 09:02 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక రేపటితో రాష్ట్రంలో ప్రచారం గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రచారం ముమ్మరం చేశారు. శనివారం మూడు సభల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజాగళం సభతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం..భూమికి చెట్టుకు ఉన్నంత అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆస్తుల దోపిడే గానీ..తరాల మధ్య ప్రేమలను పట్టించుకోని వ్యక్తి సీఎం జగన్ అన్నారు. ప్రేమలను పట్టించుకోడు కాబట్టే చెల్లెళ్లను దూరంగా పెట్టాడు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైంది అని తెలిపారు. ఇలాంటి చట్టాలకు సంబంధించిన పత్రాలు రేపు తగలబెట్టండి అన్నారు. ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇస్తాం అన్నారు. పట్టాదారు పుస్తకాల పై జగన్ బొమ్మ కాదు, రాజముద్ర వేయిస్తా అని స్పష్టం చేశారు. అలాగే మీ భూమి పదిలంగా ఉండాలంటే కూటమికి ఓటేయండని కోరారు. కూటమి అధికారంలోకి రాగానే ఎల్‌టీఏ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత నాది అన్నారు. అంతే కాకుండా టిడ్కో ఇళ్లు ఇస్తాం. విద్యుత్ ఛార్జీలు పెంచను అని హామీ ఇచ్చారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News