Big Breaking: మాచర్లలో హై టెన్షన్.. 144 సెక్షన్ అమలు..

ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్టా రెడ్డి పోలింగ్ వేళ ఈవీఎంలను ధ్వంసం చేసిన విషయం అందరికీ తెలిసిందే.

Update: 2024-05-23 04:39 GMT

దిశ వెబ్ డెస్క్: ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్టా రెడ్డి పోలింగ్ వేళ ఈవీఎంలను ధ్వంసం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదుకాగా, పిన్నెల్లి పారారీలో ఉన్నారు. దీనితో రెండు తెలుగురాష్ట్రాల్లో పిన్నెల్లి కోసం నాలుగు పోలీసు బృందాలు విసృతంగా గాలిస్తున్నాయి. ఇప్పటికే అధికారులు పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

అయితే పిన్నెల్లి తన కారు, మొబైల్ వదిలి వెళ్లినట్టు సమాచారం. ఇక మరోవైపు చలో మాచర్ల నేపథ్యంలో మాచర్లలో హై టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు మాచర్లలో144 సెక్షన్ అమలు చేశారు. అలానే మాచర్లకు వెళ్లే మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని పరిశీలిస్తున్నారు. అలానే అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.  

Similar News