శశిథరూర్ ఎవరో నాకు తెలియదు.. కాంగ్రెస్ మాజీ MP షాకింగ్ కామెంట్స్
కాంగ్రెస్ లో విప్లవాత్మక మార్పులు జరగుతున్నాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు.
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ లో విప్లవాత్మక మార్పులు జరగుతున్నాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేత మల్లిఖార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షడు కాబోతున్నాడని.. కానీ కొన్ని కార్పొరేట్ శక్తులు దీనిని అడ్డుకోబోతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న శశిథరూర్ ఎవరో తనకు తెలియదని చింతా మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే గత కొంత కాలంగా కాంగ్రెస్ చతికిలపడిందని.. ఆ విషయంపై చర్చించుకోవాలని సూచించారు. దేశంలో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.