సీఎం జగన్‌పై దాడి.. హీరో విశాల్ సెన్సేషనల్ కామెంట్స్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేస్తానని తమిళ స్టార్ హీరో విశాల్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

Update: 2024-04-17 10:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేస్తానని తమిళ స్టార్ హీరో విశాల్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనకు ముందే విశాల్ ఏపీ ఎలక్షన్స్‌లోనూ పోటీ చేయబోతున్నారని పుకార్లు షికార్లు చేశాయి. కానీ దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను ఇంకా రాజకీయాల్లోకి రావడానికి సమయం ఉందని, ఏపీ పాలిటిక్స్‌లోకి మాత్రం రావడం లేదని చెప్పుకొచ్చారు. తాజాగా ఏపీ సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడిపై హీరో విశాల్ తనదైన శైలిలో స్పందించారు.

సీఎం జగన్‌పై జరిగిన దాడిలో కుట్ర కోణం దాగి ఉందన్నారు. కావాలనే ఆయనపై దాడి చేసినట్టు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. గతంలోనూ జగన్‌పై కోడి కత్తితో దాడి చేశారని గుర్తు చేశారు. జగన్ రాయలసీమ బిడ్డ అని, పులివెందులలో పుట్టిన ఆయన ఇలాంటి దాడులకు భయపడని చెప్పుకొచ్చారు. తను జగన్‌కు మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. కచ్చితంగా ఆయనే సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేయాలంటే జగన్ అధికారంలో ఉండాలన్నారు. జగన్ అంటే తనకు ఇష్టమని విశాల్ తెలిపారు. 


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News