GuraZala: దమ్ముంటే అలా చేయ్.. నారా లోకేశ్‌కు కాసు మహేశ్ రెడ్డి సంచలన సవాల్

గుంటూరు జిల్లా గురజాలలో పొలిటికల్‌హీట్ కొనసాగుతోంది...

Update: 2023-08-02 10:25 GMT

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా గురజాలలో పొలిటికల్‌హీట్ కొనసాగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర రెండు, మూడు రోజుల్లో గురజాలకు చేరుకోనుంది. దీంతో టీడీపీ శ్రేణులన్నీ సమాయత్తమయ్యాయి. తమ యువ నేత నారాలోకేశ్‌ను ఘనంగా స్వాగతించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.

నారా లోకేశ్‌‌ పర్యటనపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి స్పందించారు. టీడీపీ 14 ఏళ్ల హయాంలో నియోజవర్గంలో జరిగిన అభివృద్ధిపై నారా లోకేశ్ చర్చించాలని, అందుకు తాను సిద్ధమని చెప్పారు. తాను ఒక్కడినే చర్చకు వస్తానని, నారా లోకేశ్ 10 వేల మందితో వచ్చిన సరేనన్నారు. దమ్ముంటే గురజాలలోనే బహిరంగ చర్చకు రావాలని నారా లోకేశ్‌కు కాసు మహేశ్ రెడ్డి సవాల్ విసిరారు.

గతంలో ఇదే సవాల్‌ను యరపతినేని శ్రీనివాసరావుకు విసిరితే ఆయన స్పందించలేదని కాసు మహేశ్ రెడ్డి తెలిపారు. యువగళం పాదయాత్రలోనైనా గురజాల నియోజకవర్గం అభివృద్ధిపై నారా లోకేశ్ బహిరంగ సభ పెట్టాలని.. తాను లెక్కలతో ఒక్కడినే వస్తానని కాసు మహేశ్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. 

Tags:    

Similar News