రేపు ఢిల్లీకి సీఎం జగన్.. వచ్చే వారంలో అసెంబ్లీ సమావేశాలు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వచ్చే వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి....

Update: 2023-09-12 07:35 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వచ్చే వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో సహా పలువురు బీజేపీ కేంద్రమంత్రులను ఆయన కలవనున్నారు. ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలను వారి దృష్టికి జగన్ తీసుకెళ్లనున్నారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత కేబినెట్ భేటీ జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో పెట్టాల్సిన బిల్లులు, చర్చించాల్సిన అంశాలపై చర్చించనున్నారు.

Tags:    

Similar News