Cs JawaharReddyని కలిసిన అలీ..మర్యాదపూర్వకమేనంటున్న Ycp శ్రేణులు

అమరావతి సచివాలయంలో సీఎస్ డా.కేఎస్ జవహర్ రెడ్డిని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు మహ్మద్ అలీ కలిశారు...

Update: 2022-12-08 17:17 GMT

దిశ వెబ్ డెస్క్: అమరావతి సచివాలయంలో సీఎస్ డా.కేఎస్ జవహర్ రెడ్డిని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు మహ్మద్ అలీ కలిశారు. సీఎం జగన్ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి ఈ నెల 1న రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయనను కలిసిన అలీ అభినందనలు తెలిపారు. అలాగే అలీ ప్రస్తుతం ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు అలీ వైసీపీలో చేరారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు తన వంతు ప్రచారం నిర్వహించారు. దీంతో ఏపీ ప్రభుత్వం అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి ఇచ్చింది. అయితే వీరి కలయిక పూర్వదపూర్వకమేనని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.

Similar News