పురంధేశ్వరి ఆత్మీయ సమావేశం.. రచ్చ రచ్చ చేసిన టీడీపీ కార్యకర్తలు

రాజమండ్రిలో పురంధేశ్వరి ఆత్మీయ సమావేశం రసాభాసగా మారింది..

Update: 2024-04-08 17:11 GMT

దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి ఉమ్మడి కూటమి పార్లమెంటు అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమెకు సోమవారం నిరసన సెగ తగిలింది. రాజమండ్రిలో బీజేపీ, టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు.  అయితే సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతోె సభలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని బీజేపీ నాయకులు తొలగించి తెలుగు తమ్ముళ్లకు క్షమాపణ చెప్పినా వినిపించుకోలేదు. దీంతో సభ విరమించకుని పురంధేశ్వరి వెన్నుతిరిగారు.  


అయితే రాజానగరం తెలుగు తమ్ముళ్లతోపాటు జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ కూడా నిరసన తెలిపారు. బొడ్డు పిలుపు, బత్తుల గెలుపు అనే నినాదాలతో సుమారు రెండు కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. గంటపాటు ఎదురు బదురు రెండు అంబులెన్సులు  నిలిచిపోయాయి. అటు ప్రయాణికులు, వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు,

Tags:    

Similar News