Tdp Mahanadu: రాజమండ్రిలో టెన్షన్.. టెన్షన్.. ఒక్కసారిగా అవి ప్రత్యక్షం

రాజమండ్రిలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు రాజమండ్రిలో మహానాడు కార్యక్రమం జరుగుతోంది.

Update: 2023-05-27 05:21 GMT

దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రిలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు రాజమండ్రిలో మహానాడు కార్యక్రమం జరుగుతోంది. దీంతో రాజమండ్రి వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే రాత్రి రాత్రికే వైసీపీ ఫ్లెక్సీలు కూడా ప్రత్యక్షమయ్యాయి. మహానాడుకు దీటుగా తగ్గేదేలే అని స్థానిక వైసీపీ నేతలు అంటున్నారు. ఎంపీ భరత్ ఫ్లెక్సీలను ఆయన వర్గీయులు ఏర్పాటు చేశారు. పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం అంటూ కొటేషన్స్ పెట్టి మరీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యక్రమం జరుగుతుండగా టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తున్నారు. వైసీపీ కుయుక్తులకు తాము వివాదంలో చిక్కుకోమని చెబుతున్నారు.

Read more:

TDP Mahanadu: పసుపు మయమైన రాజమండ్రి.. కాసేపట్లో సభా వేదికకు చంద్రబాబు

Tags:    

Similar News